పర్యావరణ పరిరక్షణ లో భాగంగా నదీ జలాలను కాలుష్యకారకాలనుండి కాపాడుకోవాలిసిన బాధ్యతను గుర్తించిన'విద్యార్దుల కధ తో జి.కె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రంజిత్, సనఫాతిమా జంటగా పి.నరసింహారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80శాతం పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. జూన్ నెలాఖరువరకు చిత్రీకరణ జరుపుకుని, జులై లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.కృష్ణారెడ్డి తెలిపారు. బెనర్జీ, మాస్టర్ భరత్, గుండు సుదర్శన్, రాజాశ్రిధర్, తా.రమేష్, మాధవి, వేణు, చంటి, డి.ఎమ్.కె, స్వప్నిక, భార్గవి, రితేష్, అలీమ్ఖాన్, శ్రీలేఖ, కావేరి, రామాచారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:రాజేంద్ర భరద్వాజ్, కెమెరా:సంతోష్ శానమోని, సంగీతం:రామనారాయణ, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి.