EE VARASHAM SAKSHIGA ....
వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా మొగిలిరమణ దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బా రెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మించిన 'ఈ వర్షం సాక్షిగా' చిత్రం విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ..........
సక్సెస్ మీట్ లో నిర్మాత బి.ఓబుల్సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ''సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. 120 కిపైగాథియేటర్స్ లో విడుదల చేసాం. ఇన్ని థియేటర్స్ లో విడుదల చేయడానికి ముందు భయపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుండేదనిపిస్తోంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమికులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజెప్పే చిత్రం ఇది. ఈ సినిమాకి ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డైరెక్టర్ మొగిలిరమణ మాట్లాడుతూ - ''సినిమా హిట్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది. మంచి సినిమా చేసాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ''సంధ్య థియేటర్ లో సినిమా చూసాము. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్. నా గత చిత్రాలకంటే, ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. జబర్ధస్త్ టీం చేసిన కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ హరిప్రియ, కాశీ విశ్వనాధ్ తదితరులు పాల్గొని సినిమా విజయం సాధించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.